భారత్ వర్సెస్ వెస్టిండీస్ ఫీవర్: భారీగా బెట్టింగులు, రూ.1 కోటి స్వాధీనం
హైదరాబాద్: ముంబైలో గురువారం రాత్రి ఏడున్నరకు వెస్టిండీస్ - భారత్ జట్లు ప్రపంచ కప్ ట్వంటీ 20 సెమీ ఫైనల్లో ఢీకొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా బెట్టింగు రాయళ్లు తెరపైకి వచ్చారు. హైదరాబాదులోని బెట్టింగు రాయళ్లు పట్టుబడుతున్నారు.
వెస్టిండీస్, భారత్ మ్యాచ్ నేపథ్యంలో భారత్ అంతా క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో బెట్టింగ్ రాయళ్ల పైన పోలీసులు దృష్టి సారించారు. హైదరాబాదులో పలుచోట్ల నాకా బందీ నిర్వహించారు. మాదాపూర్, మల్కాజిగిరి, వనస్థలిపురం, రాజేంద్రనగర్, అల్వాల్ తదితర ప్రాంతాల్లో నిర్వహించారు.
పోలీసుల రాకతో బెట్టింగ్ రాయళ్లు పారిపోయారని తెలుస్తోంది. పోలీసులు భారీగా నాకాబందీ నిర్వహిస్తున్నారు. పోలీసులు పెద్ద మొత్తంలో డబ్బును బెట్టింగ్ రాయళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
దాదాపు కోటిన్నర రూపాయలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. బెట్టింగ్ రాయళ్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే, కొందరి డబ్బును స్వాధీనం చేసుకున్నప్పటికీ అవి బెట్టింగుకు సంబంధం లేనివని తెలుస్తోంది.