వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్! ఇడుపులపాయ ఇవ్వండి: బాలకృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
కడప: ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ ఇజెడ్) కోసం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తన ఇడుపులపాయ ఇవ్వాలని తెలుగుదేశం నేత, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. పేదల భూములను బలవంతంగా లాక్కుని 96 ఎస్ఇజెడ్ లకు ముఖ్యమంత్రి పూనుకున్నారని, ఇటువంటి చర్య దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లాలో తన ప్రచారాన్ని ముగించుకుని ఆయన గురువారం ఉదయం కడప జిల్లాలో ప్రవేశించారు. కడప జిల్లాలో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. కడప జిల్లా రోడ్ షోల్లో ఆయన తొడ కొట్టి మీసాలు మెలేశారు.

రాయలు ఏలిన రతనాల సీమ అంటూ ఆయన ప్రశసించారు. కాంగ్రెసును నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. కాంగ్రెసు నోట్లకు ఓట్లు అమ్ముకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. కాంగ్రెసు అవినీతికి చిరునామాగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీరామారావు తెలుగుగంగ ప్రాజెక్టు చేపట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఐటి అభివృద్ధి చెందిందని, యువతకు ఇతోధికంగా ఉపాధి లభించిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X