జగన్ యాత్రను ఆపుతారా: చిరంజీవి
నేతన్నలను, రైతన్నల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. రైతు చైతన్య యాత్రలు అవసరం లేదని, రైతుల్లో చాలా చైతన్యం ఉందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పొందేందుకు ఏం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు నేతలు జగడాలు మాని ప్రజా సమస్యలు పట్టించుకోవాలని ఆయన హితవు చెప్పారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన తనకు స్వార్థ రాజకీయాలు తెలియవని ఆయన అన్నారు. పోలవరం డిజైన్ మార్పు, ఖర్చుల కమిటీకి సిఫార్సు వంటి చర్యలు ప్రాజెక్టు నిర్మానంలో జాప్యం చేయడానికేనని ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Story first published: Monday, May 17, 2010, 14:38 [IST]