టిడిపిలో జోక్యం చేసుకోను, కడపలో కాంగ్రెసుదే గెలుపు: పురందేశ్వరి
కాంగ్రెసు పార్టీ నేతలంతా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని గౌరవిస్తున్నారని అన్నారు. వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని చెప్పారు. అది తనకు సంబంధం లేని విషయం అన్నారు. కాంగ్రెసు సంక్షోభాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
కాగా కడపలో ఎమ్మెల్యే వీరశివారెడ్డి కాంగ్రెసు ఖచ్చితంగా గెలుస్తుందని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. జగన్ మెజార్టీపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. జగన్కు రెండు లక్షల మెజార్టీ వస్తుందని తాను చెప్పిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని వారు రెండు లక్షల మెజార్టీ వస్తుందంటే దానిపై తాను సవాల్ చేశానని, కానీ జగన్ గెలుస్తాడని చెప్పలేదన్నారు. మంత్రి డిఎల్ ఖచ్చితంగా గెలుపొందుతారని అన్నారు. జగన్ సొంత జిల్లాలోని వారినే మోసం చేశారన్నారు. భారతిలో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వడం లేదన్నారు.