కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప ఉప ఎన్నికలలో డబ్బుల వరద పారింది: స్వామి అగ్నివేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Swami Agnivesh
న్యూఢిల్లీ: కడప, పులివెందుల ఉప ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కోట్లు గుమ్మరించాయని స్వామి అగ్నివేష్ గురువారం ఆరోపించారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప ఉప ఎన్నికలలో ప్రజాస్వామ్యం కూనీ అయిందన్నారు. ఉప ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాయన్నారు. ఎన్నికలలో అవినీతిపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.

తెలంగాణ ఇస్తామని మొదట చెప్పి ఆ తర్వాత మాట మార్చిన కేంద్రమంత్రి చిదంబరం వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేలా ఉందన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ప్రకటించాలన్నారు.

English summary
Swami Agnivesh blamed Kadapa bypoll. He said political parties spend crores money in poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X