వల్లభనేని వంశీ, జగన్ల కలయికను తప్పుపట్టిన చమన్
వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తనను చాలా బాధించిందన్నారు. తననే కాదు పరిటాల అభిమానులను అందరిని వేధించిందని అన్నారు. రవి హత్యలో ఎవరెవరున్నారు, ఎవరెవరి పాత్ర ఎంత ఉందో కోర్టులో తేలుతుందని ఆయన చెప్పారు.
వల్లభనేని వంశీ తన కుమారుడికి పరిటాల రవి పేరు పెట్టుకొని జగన్ను కలవడం సరికాదన్నారు. డిజిపి తన ప్రాణానికి రక్షణ కల్పిస్తానని హామీ ఇవ్వడం వల్లనే తాను లొంగిపోయానని ఆయన చెప్పారు. పరిటాల రవి అనుచరుడు అయిన చమన్ ఆయన హత్య తర్వాత కొంతకాలం అజ్ఞాతంలో ఉండి ఆ తర్వాత లొంగిపోయాడు.
కాగా రెండు రోజుల క్రితం విజయవాడలో వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. వీరి కలయిక రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కలిగించింది. తెలుగుదేశం పార్టీ వంశీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై చమన్ గుంటూరులో స్పందించారు.