విషపు ఇంజక్షన్లతో హత్యాయత్నం: పేలుడు పదార్థాలు
అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. శ్రీనివాస రావు గతంలో పలు ప్రభుత్వ కార్యాలయాల నుండి వివిధ సమాచారాలు కోరినట్లుగా తెలుస్తోంది. ఆయనపు విష ప్రయోగం జరగడపం ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు, ప్రజాస్వామ్యవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.
హైదరాబాదులో...
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నారనే సమాచారం రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై సోదాలు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. 1300 జిలెటిన్ స్టిక్స్, 800 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు.
బాగ్ అంబరుపేటలో దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ ఇంటిలో నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితమే వారు మృతి చెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో పేలుడు
తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం పేలుడు సంభవించింది. బాణసంచా కేంద్రంలో ఇది జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.