గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు, అనుమానంతో ఇలా....

ప్రేమించి మతాతంతర వివాహం చేసుకొన్న యువకుడే అనుమానంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తెనాలి:ప్రేమించి మతాతంతర వివాహం చేసుకొన్న యువకుడే అనుమానంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.

గుంటూరు పట్టణంలోని నందులపేట భాస్కర్ రావు దిబ్బకు చెందిన స్వర్ణకారుడు మానేపల్లి బ్రహ్మం 9 ఏళ్ళ క్రితం తెనాలి రూరల్ మండలానికి చెందిన షేక్ రిజ్వానా అలియాస్ పద్మను ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు.

acid attack

వీరిక ఏడేళ్ళ కుమార్తై కూడ ఉంది. రిజ్వానా తరచూ ఫోన్ మాట్లాడుతుండడంపై అతడికి అనుమానపడ్డాడు.ఈ విషయమై ఆయన ఆమెతో గొడవపడ్డాడు. శనివారం నాడు రిజ్వానాను డాబాపైకి తీసుకెళ్ళి తనతోపాటు తెచ్చుకొన్న యాసిడ్ ను ఆమె ముఖంపై పోశాడు.

యాసిడ్ ముఖం నుండి కిందకు కారి ఒళ్ళంతా కాలిపోయింది. రిజ్వానా పెద్దగా కేకలు వేస్తూ కిందకు రావడంతో స్థానికులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి బంధువల ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మం ద్విచక్ర వాహనంపై పారిపోయాడు.

English summary
acid attack on wife by husband in guntur district.brahmam married rizwana nine years back.she has extra marital affair other person he suspected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X