హృదయాన్ని కదిలించే కుక్క, ఎద్దు స్నేహం (పిక్చర్స్)
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం మంగళూరులో ఓ హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. ఓ కుక్క, ఎద్దు చాలాకాలంగా స్నేహితులుగా ఉంటున్నాయి.
మంగళూరులోని అట్టావర్ ప్రాంతంలో చాలాకాలంగా ఓ కుక్క, ఎద్దు స్నేహంగా ఉంటున్నాయి. ఈ రెండింటి స్నేహాన్ని స్థానికులు చాలారోజులుగా గమనిస్తున్నారు.
ఈ రెండు ఎంతోకాలంగా అదే ప్రాంతంలో ఉంటున్నాయి. ఎద్దు నిద్రిపోతుంటే కుక్క కాపలా ఉండేదట. ఎద్దు లేచిన తర్వాతనే కుక్క నిద్ర పోయేదట.
ఎద్దు - కుక్క
ఎద్దు, కుక్కల స్నేహం స్థానికులు చూసి ముచ్చట పడేవారు. అయితే, ఇంతలోనే ఓ విషాద సంఘటన జరిగింది. ఆగస్టు 24వ తేదీన జైన్ కాంపౌండులో ఎద్దు మృతి చెందింది.
ఎద్దు - కుక్క
ఎద్దు మృతి చెందడంతో ఆ కుక్క అక్కడే కాపలాగా ఉంది. స్థానికులను, ఇతరులను ఎవరిని కూడా అక్కడకు వెళ్లనీయలేదు. ఎద్దు పడుకుందనుకుందో లేదా మరేమో కానీ ఎద్దు వద్దకు ఎవరైనా వెళ్తే మాత్రం కుక్క ఆపుతోంది.
ఎద్దు - కుక్క
చాలాసేపటి తర్వాత.. చాలామంది వచ్చిన తర్వాత కానీ ఆ కుక్క ఎద్దు దగ్గరి నుండి కొంత పక్కకు జరగలేదు. స్థానికులు ఆ ఎద్దును ఖననం చేశారు.
ఎద్దు - కుక్క
ఎద్దును ఖననం చేసిన తర్వాత స్థానికులు అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే స్నేహంగా ఉన్న కుక్క మాత్రం అక్కడే కూర్చొని ఉంది.
ఎద్దు - కుక్క
ఇప్పటి వరకు అక్కడి నుండి కదలలేదు. ఆహారం, నీరు తీసుకోవడానికి కూడా వెళ్లలేదు. ఈ సంఘటన చూసిన వారిని కదిలిస్తోంది.