బ్యాంకర్ను చంపిన గే లవర్స్: నలుగురి అరెస్టు

అరెస్టయిన నలుగురు కూడా మైనర్లని, విద్యార్థులని తేలింది. ఐదో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 20 ఏళ్ల గౌతం అనే ఇతను నుంగంబాకంలోని షోరూంలో పనిచేస్తాడు. తనతో సెక్స్ కోసం నాగరాజన్ తమకు డబ్బులు ఇచ్చాడని, అతని సంకెళ్ల నుంచి బయటపడడానికి ప్రయత్నించడంతో తమను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడని, విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్తానని బెదిరించాడని నిందితులు చెప్పారు.
నాగరాజన్ను ఆ యువకులు 2008లో కలిశారు. అప్పుడు అతను బ్యాంక్ కాసిమేడు శాఖ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బులు వస్తుండడంతో వారు నాగరాజన్ కోరికను తీర్చడానికి సిద్ధపడ్డారు. నాగరాజన్ వారిని ఇంటికి పిలిచి, భోజనం పెట్టి తన పడకగదిలోకి తీసుకుని వెళ్లేవాడని పోలీసులు చెప్పారు. దాని పరిణామాలు తెలిసే వయస్సు కూడా వారికి లేదని అంటున్నారు.
యువకులను అక్టోబర్ 16వ తేదీన నాగరాజన్ తన ఇంటికి పిలిచాడు. అప్పుడే అతన్ని చంపాలని వారు నిర్ణయించుకున్నారు. పడకగదిలోకి వెళ్లిన తర్వాత వారిలో ఒకతను అతని తలపై కొట్టాడు. దాంతో అతను పడిపోయాడు. మరో ఇద్దరు చేతులతో అతని గొంతు నులిమారు. అతన్ని వారు విపరీతంగా కొట్టారు. అతని బెల్టు తీసి దానితో ఉరి వేశారు. గొంతు నులమడంతోనే అతను చనిపోయాడని అంటున్నారు.
ఆ సమయంలో 87 ఏళ్ల తల్లి కింది అంతస్థులోనే ఉంది. కానీ ఆమెకు అనుమానం రాలేదు. సంఘటన పై అంతస్థులో జరిగింది. హత్య చేసిన తర్వాత ముగ్గురు నాగరాజన్ సెల్ఫోన్, బంగారం రింగ్ తీసుకుని పెరుంగుడి రైల్వే స్టేషన్కు వెళ్లారు. మరో ఇద్దరు అతని స్కూటర్ తీసుకుని రైల్వే స్టేషన్కు వెళ్లారు. బుధవారం తెల్లవారు జామను సబర్బన్ రైలులో రోయాపురం వెళ్లారు. హత్య జరిగిన సమయంలో నాగరాజన్ భార్య సెల్వి అమెరికాలో ఉంది.












Click it and Unblock the Notifications