MP: ఈడీ ఆఫీసులో ఏం జరిగిదంటే ?, ఎంపీ సంజయ్ క్లారిటీ, భార్య బ్యాంక్ అకౌంట్ కు రూ. 55 కోట్లు?, ఏక్ నాథ్!
ముంబాయి/న్యూఢిల్లీ: శివసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైనారు. అక్రమంగా నగదు బదిలీ చేశారని, భూకుంభకోం స్కామ్ లో ఉన్న నిందితుల నుంచి ఆయన భార్య బ్యాంక్ అకౌంట్ కు 55 కోట్ల రూపాయల నగదు బదిలీ చేయించుకున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలపై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఇప్పుడు కష్టాలు ఎదరైనాయి. ఈడీ అధికారుల విచారణ తరువాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ ఈడీ ఆఫీసులో ఏం జరిగింది ? అని విషయంలో క్లారిటీ ఇచ్చారు.

ఎంపీని 10 గంటలు విచారణ చేసిన ఈడీ
శుక్రవారం ముంబాయిలోని ఈడీ కార్యాలయానికి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెళ్లారు. సుమారు 10 గంటల పాటు ఈడీ అధికారులు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఈడీ అధికారుల విచారణ తరువాత శుక్రవారం రాత్రి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆ కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

ఈడీ ఆఫీసులో ఏం జరిగిదంటే?
మహారాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలకు మా మీద ఎలాంటి అనుమానం లేదని సంజయ్ రౌత్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలకు మా మీద అనుమానం వచ్చిందని, వారి అనుమానాలు తీర్చడానికి తాను ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైనానని, అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరించానని, తాను ఏ తప్పు చెయ్యలేదని శివసేన ఎంపీ సంజయ్ రైత్ మీడియాకు చెప్పారు.

చావల్ భూకుంభకోణం స్కామ్
చావల్ భూకుంభకోణం స్కామ్ తో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు సంబంధం ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. పత్రా చావల్ భూకుంభకోణం స్కామ్ కేసు విచారణ చేస్తున్న ఈడీ అధికారులు ఇప్పుడు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను విచారణ చేస్తున్నారు. ఈ చావల్ భూకుంభకోణం స్కామ్ లో శివసేన ఎంపీకి సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఎంపీ సంజయ్ భార్య అకౌంట్ కు రూ. 55 కోట్లు?
చావల్ భూకుంభకోణం స్కామ్ కు సంబంధించి ప్రవీణ్ రావత్ అతని భార్య అకౌంట్ నుంచి అక్రమంగా నగదు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య హర్షా అకౌంట్ కు రూ. 55 కోట్లు బదిలీ చేశారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. చావల్ భూకుంభకోం స్కామ్ లో ఉన్న నిందితుల నుంచి సంజయ్ రౌత్ భార్య హర్షా రౌత్ బ్యాంక్ అకౌంట్ కు 55 కోట్ల రూపాయల నగదు బదిలీ చేయించుకున్నారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఆలీభాగ్ లో భూములు
ఆ డబ్బు 2010, 2012లో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య అకౌంట్ కు బదిలీ అయ్యింది, ఆ డబ్బుతో ఆలీబాగ్ లో భూమి కొనుగోలు చేశారని, ప్రవీణ్ రావత్ భార్య శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య హర్షాకు రూ. 55 లక్షలు అప్పుకూడా ఇచ్చారని సంజయ్ రౌత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ప్రధాని మోదీ, అమిత్ షా మీద విసుర్లు, ఇప్పుడు?
మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలపై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఇప్పుడు కష్టాలు ఎదరైనాయి. వసేన చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకి అత్యంత సన్నిహితుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఈడీ అధికారుల ముందు విచారణ ఎదుర్కొంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications