వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నందిగ్రామ్‌లో ఓటమి ఖరారు, మరో స్థానంలో మమతా బెనర్జీ నామినేషన్? -ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ లోనూ ఓటింగ్ శాతం భారీగా నమోదైంది. గురువారం నాటి రెండో దశలో సాయంత్రం ఐదు గంటల వరకు 72.25 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా, ఇది టీఎంసీ పాలనపై ప్రజలకు ఉన్న ఆగ్రహానికి నిదర్శనమని, మమతా బెనర్జీని ఇంటికి పంపేయాలని బెంగాలీలు డిసైడైపోయారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతిష్టాత్మక నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంపైనా ప్రధాని సంచలనల కామెంట్లు చేశారు..

జగన్,కేసీఆర్‌కు మమత లేఖపై మోదీ ఫైర్ -టీఎంసీ కూల్ కూల్ కాదు, పెద్ద శూల్ -బీజేపీకి 200సీట్లు: ప్రధానిజగన్,కేసీఆర్‌కు మమత లేఖపై మోదీ ఫైర్ -టీఎంసీ కూల్ కూల్ కాదు, పెద్ద శూల్ -బీజేపీకి 200సీట్లు: ప్రధాని

బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బరిలో నిలవడంతో ఈసారి నందిగ్రామ్ సీటుపై విస్తృత చర్చ జరుగుతోంది. ఒకప్పటి మమత అనుచరుడు, ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారి ఆమెకు గట్టి పోటీ ఇస్తున్నారు. రెండోదశలో భాగంగా గురువారం అక్కడ పోలింగ్ జరిగింది. అదే సమయంలో ఉలుబేరియా జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ దీదీపై మోదీ సెటైర్లు వేశారు..

Nandigram paving way for renaissance, is Didi seeking another seat, says pm modi in Uluberia rally

నందిగ్రామ్ లో మమత ఓటమి ఖరారైపోయిందని, ఒక్క నందిగ్రామ్ స్థానం నుంచే కాకుండా మమతను ఇంటికి పంపేయాలని యావత్ బెంగాల్ నిర్ణయించుకుందని ప్రధాని అన్నారు. నందిగ్రామ్ లో ఓడిపోబోతున్న మమత మరో స్థానంలో నామినేషన్ వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోందనీ మోదీ చెప్పారు.

నీలం సాహ్ని తొలి భేటీ టీడీపీతోనే -ఎస్ఈసీతో వర్ల రామయ్య -కొత్త నోటిఫికేషన్‌కు డిమాండ్ -పరిషత్ నగారానీలం సాహ్ని తొలి భేటీ టీడీపీతోనే -ఎస్ఈసీతో వర్ల రామయ్య -కొత్త నోటిఫికేషన్‌కు డిమాండ్ -పరిషత్ నగారా

''దీదీ.. నేను విన్నది నిజమేనా? మరో నియోజకవర్గం నుంచి కూడా మీరు నామినేషన్ వేస్తున్నారట కదా! నందిగ్రామ్ లో మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు మరో చోటుకి వెళ్లాలనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా సరే, ఒకే రీతిలో సమాధానం చెప్పడానికి బెంగాలీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు'' అని మోదీ వ్యాఖ్యానించారు. నందిగ్రామ్ ప్రజలు ఈరోజు తమ కలను సాకారం చేసుకున్నారని, ఇవాళ జరిగింది కేవలం ఓటింగ్ మాత్రమే కాదు.. బెంగాల్ పునరుజ్జీవానికి మార్గం పడిందని మోదీ అన్నారు.

ప్రధానినైన తనను బయటి వ్యక్తిగా, టూరిస్టుగా మమత అభివర్ణించడాన్ని గుర్తుచేస్తూ... చొరబాటుదారులను సొంత బిడ్డలుగా చూసే దీదీ.. భారతమాత బిడ్డనైన నన్ను బయటి వ్యక్తి అనడం సబబేనా? ప్రజల్ని ఇలా విడదీయడం కరెక్టేనా? ఇది రాజ్యాంగ నియమావళికి విరుద్ధం కాదా? అని మోదీ నిలదీశారు. బెంగాల్ రెండో దశలోనూ భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది.

English summary
As polling is underway in the second phase of Assembly elections in West Bengal on Thursday, Prime Minister Narendra Modi said the people of Nandigram are not just participating in polling but paving the way for a 'renaissance' in Bengal. Addressing a public meeting in Uluberia, Modi said, "People of Bengal have decided that Didi must go. The people of Nandigram have fulfilled this dream today. Didi filing nomination from another seat?"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X