నైజీరియన్ యువతి రచ్చ: ముసుగేసి పట్టారు(వీడియో)
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని మార్కెట్ ప్రాంతంలో మద్యం మత్తులో ఓ నైజీరియన్ యువతి రచ్చ రచ్చ చేసింది. ముందుగా ఓ షాపింగ్ మాల్లోకి వెళ్లిన ఆ యువతి.. అక్కడి సామాన్లను నేలకేసి కొట్టింది. అంతేగాక, అడ్డం వచ్చిన వారిపై దాడికి యత్నించింది.
పలువురిపై చేయి కూడా చేసుకుంది. సమాచారం అందుకుని అక్కడి చేరుకున్న పోలీసులు కూడా ఆమెను ఆపలేకపోయారు. పోలీసులపైకీ దూసుకెళ్లింది ఆ నైజీరియన్ యువతి. చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు పోలీసులు. మహిళా కానిస్టేబుళ్లు కూడా ఆమెను కట్టడి చేసేందుకు విఫలయత్నం చేశారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె వెనక నుంచి వచ్చి ఓ బట్టతో ముసుగేసి ఆమెను బంధించాడు. వెంటనే చేరుకన్న పోలీసులు.. ఆమె చేతులను కట్టేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, సదరు యువతి డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.