ఇరాన్ తరహాలో టీ ఉద్యమం: హోం మంత్రి(ఫోటోలు)
హైదరాబాద్: ఇరాన్లో రాజరిక పాలన రూపుమాపి, ప్రజాస్వామ్య వ్యవస్ధ కోసం ఇరాన్ ప్రజలు ఎంతగా పోరాడారో.. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలుగా పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
ఇరాన్లో ప్రజాస్వామ్య వ్యవస్ధను సాధించుకొని 36 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బంజారా హిల్స్లోని 'ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కాన్సుల్' కార్యాలయంలో బుధవారం రాత్రి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయిని మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంతో ఇరాన్కు 200 ఏళ్ల నుంచే సంబంధాలున్నాయని గుర్తుచేశారు.
ఇరాన్ తరహాలో తెలంగాణ ఉద్యమం పోరాటం
ఇరాన్లో రాజరిక పాలన రూపుమాపి, ప్రజాస్వామ్య వ్యవస్ధ కోసం ఇరాన్ ప్రజలు ఎంతగా పోరాడారో.. అదేవిధంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలుగా పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
ఇరాన్ తరహాలో తెలంగాణ ఉద్యమం పోరాటం
నగరంలో రుచికరమైన వంటకాలన్నీ ఇరాన్దేశస్తుల నుంచి వచ్చినవేనని చెప్పారు.
ఇరాన్ తరహాలో తెలంగాణ ఉద్యమం పోరాటం
నిజాం కాలం నుంచే ఇరాన్తో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నాయని, సోదరభావంతో ఇరు దేశీయులు కలిసిమెలిసి జీవించడం సంతోషదాయకమన్నారు.
ఇరాన్ తరహాలో తెలంగాణ ఉద్యమం పోరాటం
ఇతర ప్రాంతాల ప్రజల మధ్య సోదరబావాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అనంతరం ఇరాన్ కాన్సులేట్ హసన్ నురియాన్ మాట్లాడుతూ కలిసిమెలిసి జీవనం సాగించడమే ప్రజాస్వామ్యానికి, గణతంత్రానికి అసలైన నిర్వచనమన్నారు.
ఇరాన్ తరహాలో తెలంగాణ ఉద్యమం పోరాటం
షా పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి, సయ్యద్ ఖమానీ పోరాటం ఆదర్శప్రాయమన్నారు.
ఇరాన్ తరహాలో తెలంగాణ ఉద్యమం పోరాటం
అంతకు ముందు ఇరు దేశాలు జాతీయ పతాకాలను ఆవిష్కరించి, జాతీయగీతాలాపన చేశారు. ఈ సందర్భంగా నాయిని కేక్ను కట్ చేశారు.