Violence: బాగల్ కోటే అల్లర్లు, హిందూ, ముస్లీంల శాంతిచర్చలు, 4 కేసులు, 18 మంది అందర్, నుపూర్ ఎఫెక్ట్!
బాగల్ కోటే/బెంగళూరు: బీజేపీ మాజీ నాయకురాలు నుపూర్ శర్మాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ కర్ణాటకలోని ఓ టీ దుకాణం ముందు రెండు వర్గాల మద్య జరిగిన గొడవల కారణంగా నలుగురి మీద కత్తులతో దాడులు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మద్య గొడవలు జరగడం, ఇరు వర్గాలు దాడులకు దిగడంతో బైక్ లు, షాపులు, కూరగాయల బండ్లకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రెండు వర్గాల మద్య గొడవలు జరగడంతో నాలుగు కేసులు నమోదు చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నామని బాగల్ కోటే జిల్లా ఎస్పీ జయప్రకాష్ చెప్పారు. రెండు వర్గాల మద్య గొడవలు జరగడానికి కొందరు ప్రయత్నించారని మాజీ ముఖ్యమంత్రి మండిపడుతున్నారు.

హిందూ యువకులపై కత్తులతో దాడి
నుపూర్ శర్మా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. నుపూర్ శర్మాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని బాదామి తాలుకాలోని కేరూరు పట్టణంలో రెండు వర్గాల మద్య గొడవలు జరిగాయి. హిందూ జాగరణ వేదిక బాగల్ కోటే జిల్లా కార్యదర్శి అరుణ్ కట్టమని, ఆయన సోదరుడు లక్ష్మణ్ కట్టిమని, యమనూర్ చుంగితో పాటు మరో వ్యక్తి మీద మరో వర్గానికి చెందిన యువకులు కత్తులు, వేటకొడవళ్లతో దాడి చేశారు.

రగిలిపోయిన ఊరు
ఇరు వర్గాలు దాడులకు దిగడంతో కేరూరులో 5 బైక్ లు, 10 షాపులు, ఆ ప్రాంతంలోని కూరగాయల బండ్లుకు, చిన్నచిన్న షాపులకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు రంగంలోకిదిగారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమలు చేశారు. ముందుజాగ్రత్త చర్యగా అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

నాలుగు కేసులు. 18 మంది అరెస్టు
ముందుజాగ్రత్త చర్యగా కేరూరులో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. రెండు వర్గాల మద్య గొడవలు జరగడంతో నాలుగు కేసులు నమోదు చేసి 18 మందిని అదుపులోకి తీసుకున్నామని బాగల్ కోటే జిల్లా ఎస్పీ జయప్రకాష్ చెప్పారు.ఇంకా కొంత మందికోసం గాలిస్తున్నామని, హిందూ, ముస్లీం మతపెద్దలతో శాంతి చర్చలు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ జయప్రకాష్ స్థానిక మీడియాకు చెప్పారు.

మండిపడిన మాజీ సీఎం
బాదామిలో రెండు వర్గాల మద్య గొడవలు జరగడానికి కొందరు ప్రయత్నించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడుతున్నారు. కొందరు స్వార్థం కోసం అమాయకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్దీపొందాలని అనుకుంటున్నారని మాజీ సీఎం సిద్దరామయ్య పరోక్షంగా బీజేపీ నాయకుల మీద విమర్శలు చేస్తున్నారు. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, తాను బాగల్ కోటే జిల్లా ఎస్పీ
జయప్రకాష్ తో మాట్లాడానని మాజీ సీఎం సిద్దరామయ్య ఓ ప్రకటన విడుదల చే శారు.
-
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications